గాంధీ తీర్థ్‌ మ్యూజియాన్ని సందర్శించిన నిరంజన్ రెడ్డి..

38
- Advertisement -

మహారాష్ట్ర జల్ గావ్ జైన్ హిల్స్ లో గాంధీ తీర్ధ్ మ్యూజియాన్ని సందర్శించారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్ర వెంకట రమణా రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి.

ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి….అందరి ఉన్నతి మహాత్ముని ఆకాంక్ష అన్నారు. సర్వోదయ అనే పదం యొక్క అర్ధమే అదని…మహాత్ముని బాటలో అహింసా మార్గంలో కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు. మహాత్ముని బాటలోనే సమాజంలోని సబ్బండవర్ణాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారు…వ్యక్తిగా మొదలై శక్తిగా ఎదిగిన మహాత్ముని సంపూర్ణ జీవితంపై మ్యూజియం ఏర్పాటు అధ్భుతం అన్నారు.

ప్రపంచంలోనే ఇది అరుదైన అతిపెద్ద మ్యూజియం .. అభినందనీయం…మహాత్ముని పట్ల ఎంతో తపన, ఆరాధన, అంకితభావం ఉంటేనే కానీ ఇది సాధ్యం కాదు అన్నారు. మహాత్ముని జీవితంపై జాన్ రస్కిన్ ప్రభావం అతి ఎక్కువగా ఉండేది .. సత్యం, అహింస, అందరి ఉన్నతి ఇందులో ముఖ్యమైనవన్నారు.

- Advertisement -