మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్….

210
niranjan reddy
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారీన పడగా తాజాగా వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కరోనా బారినపడ్డారు. గత రెండురోజులుగా స్వల్ప అస్వస్థత ఉండడంతో పరీక్షలు చేయించుకోగా కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

తన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, వైద్యుల సహాయ మేరకు హోం క్వారంటైన్‌లో ఉంటున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు.

- Advertisement -