డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లను పరిశీలించిన నిరంజన్‌రెడ్డి

224
niranjan reddy
- Advertisement -

వనపర్తి పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి. వనపర్తికి కొత్తగా 1500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరయ్యాయని ఇందులో పట్టణంలో 700, వనపర్తి నియోజకవర్గంలో 800 ఇండ్లు నిర్మిస్తున్నామని తెలిపారు.అదనంగా ఇండ్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

వనపర్తి పట్టణంలో పెద్దగూడెం రోడ్, చిట్యాల, అప్పాయిపల్లి రోడ్లలో నిర్మాణంలో ఉన్న ఇండ్లకు అదనంగా ఇవి మంజూరైనట్లు మంత్రి తెలిపారు. పారదర్శకంగా అర్హులైన పేదలకు ఇండ్లు కేటాయిస్తామని…పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఉన్నాయని …కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యాలు అని పేర్కొన్నారు.

- Advertisement -