రాష్ట్ర ప్రజలకు బోనాల శుభాకాంక్షలు:సీఎం కేసీఆర్

286
bonalu
- Advertisement -

బోనాల పండగ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. ప్రజలంతా భక్తి శ్రద్ధలతో బోనాలు జరుపుకోవాలని..అమ్మవారి దయతో కరోనా మహమ్మారి రాష్ట్రం నుండి తరలిపోవాలని ఆకాంక్షించారు.

కరోనా నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే బోనాల పండగ జరుపుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బోనాలు జరిగే ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్ చేయడంతో పాటు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు పోలీసులు.

తొలిసారిగా భక్తులు లేకుండానే ఉత్సవాలు జరిగాయి. అర్చకులు, నిర్వాహకులు అమ్మవారికి బోనాలు సమర్పించి కొవిడ్‌ను అంతమొందించాలని వేడుకున్నారు. 

- Advertisement -