తెలంగాణకు కేంద్రప్రభుత్వ వరద సాయం ఏది ? :నిరంజన్ రెడ్డి

85
niranjan reddy
- Advertisement -

ప్రకృతి విపత్తుపై విపక్షాల రాజకీయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో తప్పుపట్టారు. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..కోటి 47 లక్షల ఎకరాలకు రైతుబంధు, 64.95 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.7372.56 కోట్లు జమ పూర్తి కావస్తున్న రైతుబంధు నిధుల పంపిణీ.. వరదలపై విపక్షాలది బురద రాజకీయం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉండి వరద బాధితులకు సహాయం అందిస్తున్నారు.

విపక్ష నేతలు పార్టీ ఆఫీసుల్లో మీడియా ముందు రాజకీయం చేస్తున్నారు. గోదావరికి 500 ఏళ్ల తర్వాత భారీ వరదలు వచ్చాయి. కాళేశ్వరం పంప్ హౌజ్ ల నీటమునకపై తప్పుడు ప్రచారం చేస్తూ..పంప్ హౌస్ లు అనేవి ప్రాజెక్టుల పక్కనే ఉంటాయన్న కనీస ఇంగితజ్ఞానం కాంగ్రెస్, బీజేపీ నేతలకు లేదు, ఎంతసేపు ప్రభుత్వాన్ని, కేసీఆర్ ను బద్నాం చేయాలన్న ఆలోచన తప్ప..తెలంగాణకు కేంద్రప్రభుత్వ వరద సాయం ఏది ? గుజరాత్ కు తప్ప కేంద్రం తెలంగాణకు సాయం చేయదా ? తెలంగాణ బీజేపీ నేతలు మాట వరసకైనా తెలంగాణకు వరదసాయం ఇవ్వాలని కేంద్రాన్ని ఎందుకు అడగరు ? అని ప్రశ్నించారు.

తెలంగాణ ధాన్యం కొనుగోలు, తెలంగాణకు నిధుల కేటాయింపు, తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయహోదా, తెలంగాణకు వర్శిటీలు, మెడికల్ కళాశాలల కేటాయింపు, తెలంగాణ ప్రభుత్వ రుణాల సేకరణ వంటి ప్రతి విషయంలో కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నది. కేంద్రం అడ్డంకులను అధిగమించి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ పథకాలను సజావుగా కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వివక్షకు ప్రజలు సరైన సమయంలో సమాధానం చెబుతారు” అని తెలిపారు.

- Advertisement -