జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దే విజయం- మంత్రి

241
minister niranjan reddy
- Advertisement -

కార్పొరేట్ పెద్దలు కొద్దిమంది కోసం 2 లక్షల 50 వేల కోట్ల రుణాలు కేంద్రం మాఫీ చేసింది. కేంద్ర ఉద్యోగుల జీతం నుంచి కంట్రిబ్యూటరీ పెన్షన్ రూపంలో జమ చేసుకున్న 54 వేల కోట్ల రూపాయలను వాడుకొని తిరిగి వాళ్లకు ఇవ్వడానికి మాత్రం మనసు రావడం లేదు! అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కేంద్రాన్ని దుయ్యబట్టారు. మంత్రి నిరంజన్ రెడ్డి తెలంగాణ భవన్ వద్ద మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్స్ రూపంలో లక్షల మందికి కోట్ల రూపాయలు తెలంగాణ సర్కార్ పంపిణీ చేస్తోంది. వరద ముంపు ప్రజలను కేసీఆర్ సర్కారు ఆదుకుంటే బీజేపీ నేతలు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు.

దేశ రాజధాని నగరంలో ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలు పొల్యూషన్‌కి ఉండలేక ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన దుస్థితి ఉంది. రెండు జాతీయ పార్టీలు దేశాన్ని ఇన్ని సంవత్సరాలు పాలించి రాజధానిలో ఉండలేని పరిస్థితికి తెచ్చారని మంత్రి మండిపడ్డారు.ప్రజా జీవనంలో 24 గంటల కరెంట్ లేకపోతే రోజువారీ ప్రయాణం సాఫీగా సాగుతుందా?..జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ అయినా ఇతర పార్టీలను విమర్శలు చేసేవే..సొంత ఎజెండాతో ప్రచారం చేస్తున్న పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమే అన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన 7 మండలాలను ఏపీకి ఇచ్చిన ఘనత జాతీయ పార్టీది. తెలంగాణ ఏర్పడినప్పడు తెలంగాణను కించపరిచినట్లు మాట్లాడిన నేత నేటి ప్రధాని మోడీ అని మంత్రి విమర్శించారు.

ఇక జనం లేని సేనజనసేనా….సైన్యం లేని నాయకుడు పవన్ కళ్యాణ్ అని మంత్రి ఎద్దేవ చేశారు.కేంద్రం తీసుకొచ్చిన జీఎస్‌టీ-నోట్ల రద్దు అనేది సరైన నిర్ణయం కాదని అనేక మంది నిపుణులు అన్నారు ఇప్పటికీ అంటున్నారు.బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఒక్కటైనా భారీ నీటి ప్రాజెక్టు కట్టారా? అని మంత్రి ప్రశ్నించారు. తాత్కాలిక ఆవేశానికి యువత లోను కావద్దు. టీఆర్ఎస్‌లోకి వలసలు నిత్యకృత్యం..ఇతర పార్టీ ల్లోకి వలసలు అపుడపుడు జరుగుతుంటాయన్నారు. మోడీ సర్కారు వన్నీ వైఫల్యాలే..ముంబై ,బెంగళూరు వరదలు వచ్చినపుడు అక్కడ ఓ రూపాయి సాయం చేశారా ?..హైదరాబాద్ లో మేము సాయం చేస్తే అడ్డుకుంటారా ? అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని సన్న వడ్ల రైతులను కచ్చితంగా ఆదుకుంటాం. హైదరాబాద్ అత్యంత నివాస యోగ్యమైన నగరాల్లో ముఖ్యమైనది. పక్షి ఒక్కో కట్టె పుల్లను సేకరించి గూడు కట్టేందుకు కష్టపడ్డట్టే సీఎం కెసిఆర్ తెలంగాణ ఒక్కో రంగం అభ్యున్నతికి తన జ్ఞాన సారాన్ని ధార పోస్తున్నారు. తెలంగాణ వ్యతిరేకులు ఒక్కటవుతున్నరు..అన్ని సందర్భాల్లో ఎందరు కలిసినా టీఆర్ఎస్ నే ప్రజలు ఆదరించారు.జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ దే విజయం అని మంత్రి నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -