కేంద్రంపై మంత్రి నిరంజన్‌ రెడ్డి విమర్శలు..

106
Minister Niranjan Reddy
- Advertisement -

ఆదివారం అయిల్ పామ్ సాగుపై సిద్దిపేటలో నిర్వహించిన రైతుల అవగాహనా సదస్సుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాల్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు లాభసాటి పంటలపై దృష్టి సారించాలని మంత్రి నిరంజన్‌ రెడ్డి సూచించారు.

మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే కోటి ఇరవై లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఆయిల్‌ పామ్‌ సాగుపై దృష్టి సారించడంలేదని మంత్రి విమర్శించారు. కానీ తాము సాగుకు అనువైన అనేక ప్రోత్సాహకాలను రైతులకు అందజేస్తున్నామని నిరంజన్‌ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ కృషికి తోడుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆయిల్‌ పామ్‌ సాగుకు అండగా నిలవాలని కోరుతూ గతంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు.

అందుకనుగుణంగా కొన్ని ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కోరామన్నారు. కానీ, కేంద్రం స్పందన ఆశించిన స్థాయిలో లేదని విమర్శించారు. ఆయిల్‌ పామ్‌కు తెలంగాణ భూములు, వాతావరణం అనువైనవా? కాదా? అనే అంశం పరిశీలించి నిర్ణయిస్తామంటూ జాప్యం చేస్తున్నారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి మండిపడ్డారు.

- Advertisement -