కాంగ్రెస్ పాపం…పాలమూరుకు శాపం

66
- Advertisement -

కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్కపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాదయాత్ర సంధర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ సందించారు. మల్లు భట్టి విక్రమార్క పాలమూరు చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.తెలంగాణ కావాలని జనం ఉద్యమిస్తుంటే, యువత బలిదానాలు చేస్తుంటే శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం కలిపి తెలంగాణోత్తరాంధ్ర కావాలని కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాసిన చరిత్ర మరచిపొవద్దన్నారు.

పాలమూరు రంగారెడ్డికి అడ్డుపుల్లలు వేసిందే కాంగ్రెస్ పార్టీ అని..263 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలంను వదిలి 6 టీఎంసీల సామర్థ్యం ఉన్న జూరాల దగ్గర నుండి నీళ్లు తీసుకోవాలని పట్టుబట్టింది కాంగ్రెస్ అన్నారు. వందల కేసులను ఎదుర్కొని పాలమూరు రంగారెడ్డి పనులను తుదిదశకు తీసుకువచ్చాం అని..భట్టి విక్రమార్క ఏం జరింగిదో ? ఏం జరుగుతున్నదో ? తెలుసుకుని మాట్లాడాలన్నారు. పాలమూరు వలసలు, ఆకలిచావులకు కారణమే కాంగ్రెస్ అన్నారు.

Also Read:బిజినెస్‌లోకి ఎన్టీఆర్ ఎంట్రీ

కాంగ్రెస్ నాలుగు దశాబ్దాల పాలనలో పాలమూరును భ్రష్టుపట్టించిందన్నారు. పోతిరెడ్డిపాడు పొక్కపెట్టి పాలమూరు పొట్టగొట్టిందన్నారు. జూరాల, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు దశాబ్దాల పాటు సాగదీసింది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. తెలంగాణ వచ్చాకనే జూరాల నుండి పూర్తిస్థాయిలో సాగునీళ్లు అందుతున్నాయని…కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం అన్నారు.

పాలమూరు రంగారెడ్డి గురించి ప్రశ్నించే నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వం .. కాంగ్రెస్‌ ఎంపీలు ఒక్కనాడన్నా పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారా ? అని ప్రశ్నించారు. పాలమూరు గురించి, ప్రాజెక్టుల గురించి భట్టి విక్రమార్క ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది .. లేకుంటే పోయేది కాంగ్రెస్ పరువే అన్నారు.

Also Read:IPL 2023 : డిల్లీతో పంజాబ్ కు ముప్పే !

- Advertisement -