సీఎం కేసీఆర్ నాయకత్వంలో సుపరిపాలన..

73
- Advertisement -

సీఎం కేసీఆర్ నాయకత్వంలో సుపరిపాలన సాధిస్తామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. రక్షాబంధన్ కార్యక్రమం నేపథ్యంలో వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాఖీలు కట్టిన వారికి శుభాకాంక్షలు తెలిపారు నిరంజన్ రెడ్డి.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…తెలంగాణలో మహిళలు అనేక రంగాలలో పురోగమిస్తున్నారన్నారు. వ్యవసాయ, విద్యా, ఉపాధి రంగాలలో రాణిస్తున్నారు…
మహిళల శక్తిని ఎంత సద్వినియోగ పరుచుకుంటే సమాజం అంత పురోగమిస్తుందన్నారు. అన్ని వర్గాలకు సామాజిక, సాంఘీక, అర్థిక భద్రత అందిస్తున్నామని తెలిపారు.

రక్షాబంధన్ అన్నాచెళ్లెల్ల అనుబంధం మాత్రమే కాదు .. సమాజంలో ఉన్న ప్రతి మహిళను, ప్రతి శిశువును గౌరవించడమే కాకుండా కొలవడం మన సంస్కృతి. సాంప్రదాయం. దానిని కొనసాగించడం అంటే మహిళలను సంతోషపెట్టడం అన్నారు. కుటుంబంలోనే కాకుండా సమాజంలో ఎలాంటి వివక్ష, దాడి, విద్వేషం, అమానుషాలు లేకుండా వారు ఆరోగ్యంగా , ఆనందంగా ఉండగలిగే సమాజమే నిజమైన సమాజం అన్నారు.

ఆ దిశగా సమాజంలో మేల్కొలుపు రావాలి .. ప్రత్యేకించి ప్రస్తుత తరం తమ కుటుంబంలో తమ చెల్లిని, తల్లిని గౌరవించినట్లే సమాజంలోని ఇతర మహిళలను గౌరవించే సంస్కారం అలవర్చుకోవాలి…ఈ మధ్యకాలంలో అది కొరవడింది .. దాని మూలంగా వస్తున్న దుష్పరిణామాలను మనం చూస్తున్నాం అని తెలిపారు. వ్యాపారాత్మకంగా వస్తున్న సినిమాలు, నవీన సాంప్రదాయం పేరుతో జరుగుతున్న ఆరాచక కార్యక్రమాల మూలంగా పెడధోరణులు కనబడుతున్నా సమాజం తనను తాను సంస్కరించుకునే శక్తి కలిగే ఉంటుందన్నారు. సమాజంలోని కొంతమంది ఆలోచనాపరులు మిగతా వారిని ప్రభావితం చేస్తుంటారన్నారు.

- Advertisement -