రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది- మంత్రి నిరంజన్‌ రెడ్డి

138
Minister Niranjan Reddy
- Advertisement -

ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్‌ మండలం పెద్దపల్లి, కుర్తిరావుల చెర్వు గ్రామాల్లో‌ రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీ రాములు, జిల్లా కలెక్టర్ శృతి ఓఝా, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ అబ్రహం హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశానికి రైతు భరోసా అని.. రైతు లేకుంటే రాజ్యమే లేదని, రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందని అన్నారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైతు వేదికలు కర్షకులకు భరోసా కేంద్రాలుగా ఉండనున్నాయని చెప్పారు. రైతును రాజు చేయాలని సీఎం కేసీఆర్‌ చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేసే ఏ ప్రభుత్వాలు ఇప్పటికీ మనుగడ సాగించలేదని గుర్తు చేశారు. దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతును పరబ్రహ్మగా మంత్రి అభివర్ణించారు.

- Advertisement -