కష్టం చేసే ఓపిక ఉంటే ఉపాధికి ఢోకాలేదు: నిరంజన్ రెడ్డి

58
Minister niranjan reddy
- Advertisement -

కష్టం చేసే ఓపిక ఉంటే రాష్ట్రంలో ఉపాధికి ఢోకాలేదన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి మండలం కిష్టగిరి గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన మినీ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు నూతన పింఛన్‌ కార్డులు అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే మార్పు సాధ్యమైంది. సాగునీరు వచ్చి పంటలు పండుతుండడంతో భూముల ధరలు అమాంతంగా పెరిగాయన్నారు. గతంలో భూములు ఉన్నా నీళ్లు. కరెంట్‌, పెట్టుబడికి డబ్బులు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడేవారన్నారు.

రైతులు విభిన్న పంటలసాగుపై దృష్టిసారించాలని ఆయన సూచించారు. కష్టం చేసే ఓపిక ఉంటే ఉపాధికి ఢోకా లేదు అనే పరిస్థితికి రావాలన్నదే మా ఆలోచన. ప్రయత్నాలు ఫలించేందుకు ప్రజల సహకారం, ఆశీస్సులు కావాలన్నారు.

- Advertisement -