రుణమాఫీ కచ్చితంగా చేసి తీరుతాం: నిరంజన్‌ రెడ్డి

85
runamafi
- Advertisement -

కరోనా కారణంగా రైతు రుణమాఫీ ఆలస్యమైందని….రుణమాఫీ కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వనపర్తి మండల ప్రాథమిక వ్యవసాయ సహకారా సంఘం మహాజన సభకు హాజరైన నిరంజన్ రెడ్డి… తెలంగాణ రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమని తేల్చిచెప్పారు.

రాష్ట్రంలో రైతులు అప్పులు చేసే పరిస్థితులు తగ్గిపోయాయని….. సమయానికి రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లోకి చేరుతున్నాయి. పెట్టుబడి కోసం ఎవరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి ఆదాయం గడించాలన్నారు.

- Advertisement -