సన్న వంగడాల సాగుకు ప్రోత్సాహం: నిరంజన్ రెడ్డి

531
niranjan reddy
- Advertisement -

సన్న వంగడాల సాగుకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్ హాకాభవన్ లో వానాకాలం సాగు సన్నాహాక సమావేశం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి జిల్లాల వారీగా వానాకాలం సాగుకు సన్నరకం వరి వంగడాలు అందుబాటులో ఉంచాలన్నారు.

రాష్ట్రంలో ఏ మేరకు సన్న వంగడాలు అందుబాటులో ఉన్నాయో వెంటనే నివేదిక ఇవ్వాలని.. ముఖ్యమంత్రి సూచన మేరకు దొడ్డు బియ్యం సాగు నుండి సన్నా బియ్యం సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలన్నారు.

వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఇతర పంటలు సాగు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత వానాకాలంలో 40 లక్షల ఎకరాలలో వరి సాగు చేయగా, అందులో 23 లక్షల ఎకరాలు సన్నాలు సాగయ్యాయని చెప్పారు. ఈ సారి 30 నుండి 35 లక్షల ఎకరాలు సన్నరకాలు సాగయ్యేలా చర్యల తీసుకోవాలన్నారు.

సాగుచేసేందుకు ముందుకొచ్చే రైతులందరికీ సన్న వంగడాలు అందించాలన్న నిరంజన్ రెడ్డి.. సాగు చేసే రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి సాంకేతిక సలహాలు అందించాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి , ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్ రావు , విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు , ఎండీ కేశవులు తదితరులు హాజరయ్యారు.

- Advertisement -