అధికారులతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్..

254
ktr it
- Advertisement -

రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల మునిసిపల్ కమిషనర్లు, అడిషనల్ కలెక్టర్లతో మంత్రి కే తారకరామారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ కట్టడిలో కీలకపాత్ర వహిస్తున్న మున్సిపల్ కమిషనర్లను అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

త్వరలో దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా కరోన వ్యాప్తికి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరారు. పట్టణాల్లో ప్రవేశపెట్టిన సరి బేసి విధానంలో దుకాణాల నిర్వహణను ప్రత్యేకంగా గమనించాలన్నారు.

ఇప్పుడిప్పుడే కరోనా మనల్ని వదిలిపెట్టి పోయే అవకాశం లేదు పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ వచ్చేంతవరకు కరోనా వైరస్ తో సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం అవసరమైన మార్గదర్శకాలను ఆరోగ్యశాఖ తో కలిసి మునిసిపల్ శాఖ ఈ రోజు విడుదల చేస్తుందన్నారు

ప్రస్తుతం పాటిస్తున్న మాస్కుల ఉపయోగం, భౌతిక దూరం పాటించడం, సనిటైజర్ల వినియోగం వంటి కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. కరోనా పరిస్థితులను సమీక్షించిన తరువాత రానున్న వర్షాకాలనికి సంబంధించిన మాన్సూన్ యాక్షన్ ప్లాన్ పైన పురపాలక మున్సిపల్ కమిషనర్లకు మంత్రి కేటీఆర్ పలు సూచనలు చేశారు.

ప్రస్తుతం పట్టణాల్లో తాగునీటికి కొరత ఎక్కువగా లేదని తెలిపారు మున్సిపల్ కమిషనర్లు. ఇప్పటికే పురపాలక శాఖ ఆరోగ్య శాఖ తో కలిసి తయారు చేసిన సీజనల్ వ్యాధుల క్యాలెండర్ను ఆధారంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఇప్పటి నుంచే వర్షాకాలంలో రానున్న డెంగ్యూ వంటి వ్యాధుల నివారణ పైన చర్యలు చేపట్టాలని ఈ మేరకు గతంలో వారం కొకసారి యాంటీ లార్వా ఆక్టివిటీస్ కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాన్ని తిరిగి రేపటి నుంచి ప్రారంభించాలని కోరారు కేటీఆర్.

రేపటి నుంచి డెంగ్యూ నివారణ లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనుంది పురపాలక శాఖ.

- Advertisement -