యాసంగిలో మినుముల సాగు భేష్: నిరంజన్ రెడ్డి

122
niranjan reddy
- Advertisement -

యాసంగిలో మినుములు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేశారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మార్క్ ఫెడ్ కేంద్ర కార్యాలయంలో పాలకవర్గ సభ్యుల సమావేశంలో మాట్లాడిన నిరంజన్ రెడ్డి…ఈ యాసంగిలో మినుములు విరివిగా సాగు చేయాలని..పూర్తి స్థాయిలో మార్క్ ఫెడ్ ద్వారా మినుముల కొనుగోలుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. రైతులు వెంటనే మినుములను విత్తుకోవాలి..మినుముల కనీస మద్ధతు ధర క్వింటాలుకు రూ.6300గా ఉందన్నారు.

మార్కెట్ ధర కనీస మద్ధతు ధర కన్నా ఎక్కువ ఉన్నా కూడా అదే ధరకు కొనడానికి ప్రభుత్వం సిధ్దంగా ఉందని తెలిపారు. అవసరమైనన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం అని…దేశ వ్యాప్తంగా మినములు, మినపపప్పు కొరత తీవ్రంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వ సంస్థ నాఫెడ్ ను సంప్రదించిందన్నారు..

నిన్ననే రాష్ట్రానికి మినుముల కొనుగోలుకు సంబంధించి లిఖితపూర్వక హామీని నాఫెడ్ సంస్థ ఇచ్చిందని మినుములతో పాటు మార్కెట్ లో డిమాండ్ ఉన్న పెసర్లు, వేరుశెనగ, ఆవాలు, నువ్వులు, పొద్దు తిరుగుడు వంటి పంటలు సాగు చేయాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు , మార్క్ ఫెడ్ ఛైర్మన్ మార గంగారెడ్డి , మార్క్ ఫెడ్ ఎండీ పి.యాది రెడ్డి మరియు ఇతర పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -