ఏపీకి పెట్టుబడులే టార్గెట్‌గా లోకేష్ టూర్‌

3
- Advertisement -

అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అక్కడి ప్రముఖ పరిశ్రమల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, కీలక రంగాల్లో భాగస్వామ్యాల కోసం ఈ పర్యటనను ఆయన వినియోగిస్తున్నారు.

తాజాగా, ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్సియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ సీఈఓ ప్రేమ్ వాత్సాతో లోకేశ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కుప్పంలో నిర్మాణం జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని వేగవంతంగా పూర్తి చేసేందుకు సహకారం అందించాలని ఆయన కోరారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని టూరిజం, హాస్పిటాలిటీ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను వివరించి, ప్రపంచ స్థాయి ప్రాజెక్టులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి మద్దతు అందిస్తుందని స్పష్టం చేశారు.

తదుపరి‌గా, కెనడాలోని టొరంటోలో బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా ప్రెసిడెంట్ గోల్డీ హైదర్‌తో కూడా లోకేశ్ సమావేశమయ్యారు. ఏపీలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల వాతావరణం, రాబోయే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, కొత్త పెట్టుబడులకు సృష్టిస్తున్న ప్రోత్సాహక విధానాలను ఆయన వివరించారు. కెనడా పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు మరింతగా దృష్టి సారించాలని, రాష్ట్రంలో తయారీ, ఐటీ, పునరుత్పాదక శక్తి వంటి రంగాలు విస్తృత అవకాశాలను అందిస్తున్నాయని లోకేశ్.. హైదర్‌కు తెలియజేశారు.

ఈ పర్యటన ద్వారా ఏపీకి అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు పెరిగినట్లు రాజకీయ, పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి.

Also Read:పంచాయతీ ఎన్నికల పోలింగ్..అప్‌డేట్‌

- Advertisement -