బస్తీ దవాఖానాలతో పేదలకు మేలు..

353
minister mallareddy
- Advertisement -

బస్తీ దవాఖానాలతో పేదప్రజలకు మేలు జరుగుతుందన్నారు మంత్రి మల్లారెడ్డి. ప్రజల కోసమే రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసిందని వెల్లడించారు.

మూసాపేట్ సర్కిల్ కేపీహెచ్ బీ కాలనీ 4వ ఫేస్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కూర్మయ్య గారి నవీన్ కుమార్, కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు, మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభించారు.

ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలో 123 బస్తీ దవాఖానాలు ఉండగా కొత్తగా మరో 45 బస్తీ దవాఖానలను మంత్రులు ప్రారంభించారు. ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్, యాదగిరి నగర్ లో బస్తీ దవాఖానలను మంత్రి కేటీఆర్ ప్రారంభించగా మోండా మార్కెట్ డివిజన్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ ప్రారంభించారు.

- Advertisement -