మంత్రి కేటీఆర్ పిలుపు….స్పందించిన మంత్రి మల్లారెడ్డి

177
ktr
- Advertisement -

టి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజల శ్రేయస్సు కొరకు నా వంతు సహాయంగా ఆరు(6) కరోనా టెస్టింగ్ అంబులెన్సులను ప్రభుత్వానికి సమకూర్చేందుకు అవసరమైన నగదును చెక్కు రూపం లో ఈరోజు కే.టి.ఆర్ గారి కి అందజేయడం జరిగింది.

అలాగే చెరువుల సుందరీకరణ,శుద్ధీకరణ,ఎకో టూరిజం పార్కుల కొరకు నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగింది.నూతనంగా ఏర్పడిన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు గతంలో టి.యూ.ఎఫ్.ఐ.డి.సి నుండి మంజూరు చేసిన రూ.25 కోట్ల 82 లక్షల అభివృద్ధి నిధులను ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయాలని కే.టి.ఆర్ ని లిఖితపూర్వకంగా కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించిన కే.టి.ఆర్ సంబంధిత అధికారులకు నిధులు విడుదల చేయవలసిందిగా ఆదేశించారు.

- Advertisement -