పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి..

156
minister mallareddy
- Advertisement -

శుక్రవారం రాష్ట్ర కార్మిక,ఉపాధి,శిక్షణ,కార్మాగారముల,నైపుణ్య అభివృద్ధి శాఖల మంత్రి సి.హెచ్ మల్లా రెడ్డి ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. వాటిలో భాగంగా మీర్‌పేట్ హెచ్‌బీ కాలనీ రాజీవ్ నగర్‌లో 70 లక్షల రూపాయలతో నిర్మించిన మినీ ఫంక్షన్ హాల్, తిరుమల నగర్, లక్మి నగర్, ఇందిరానగర్, డైమండ్ హిల్స్,కాలనీలకు 5 కోట్ల రూపాయలతో బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అలాగే మీర్‌పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్‌లో అన్ని కాలనీలకు 2 కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు, అభివృద్ధి పనులకు, తిరుమల నగర్ అసోసియేషన్ బిల్డింగ్,మరియు బండ బావి, ఎన్టీఆర్‌ నగర్‌లో 70 లక్షలతో నిర్మించిన మినీ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం, మరియు చర్లపల్లి పారిశ్రామిక వాడలో స్థాపించిన ఎల్మేడ్ లైఫ్ సైన్సెన్ సంస్థ ప్రారంభోత్స కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి మల్లా రెడ్డి. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంమ్మెల్యే సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -