రాజయ్య కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కేటీఆర్..

211
ktr minister
- Advertisement -

ఇటీవల ఆనారోగ్యంతో మరణించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆర్. అంజయ్య చిత్రపటానికి మంత్రి కేటీఆర్ కలెక్టరేట్ కార్యాలయంలో పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. మంచి అధికారిగా, ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలందించారని ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అంతకముందు మంత్రి ఇటీవల ఆనారోగ్యంతో మరణించిన మండల విద్యాధికారి మంకు రాజయ్య ఇంటికి వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. రాజయ్య మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు.

- Advertisement -