కేంద్రానికి మంత్రి కేటీఆర్ విన‌తి..

57
ktr
- Advertisement -

ఆదిలాబాద్ సీసీఐ ప‌రిశ్ర‌మ తొలగింపు అంశంపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ విన‌తి చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌కు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఓ విన్నపం చేశారు. ఆదిలాబాద్‌లో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిట్‌ను సమీక్షించి, దాన్ని పునరుద్ధరించాలని కోరారు. దీనికి సంబంధించి సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. యూనిట్ పునరుద్ధరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సహకారం అందిస్తామని చెప్పారు. ఈ యూనిట్ పునరుద్ధరింపబడితే… ఆదిలాబాద్‌కు చెందిన వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు.

మరోవైపు యూనిట్‌కు సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న చేసిన ట్వీట్ ను, వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను షేర్ చేశారు. ‘ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పరిశ్రమను పునరుద్ధరించాలని, జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం శాయశక్తులా పోరాడుతుంటే.. మరోవైపు పరిశ్రమ తొలగింపునకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది’ అంటూ జోగు రామన్న ట్వీట్ చేశారు.

- Advertisement -