సిరిసిల్ల నేతన్నల రాత మార్చిన నేత కేటీఆర్..

125
- Advertisement -

తెలంగాణ ఏర్పడక ముందు సిరిసిల్ల అంటే ఉరిశాల అనే నానుడితో వ్యవహరించిన దుర్భర స్థితి మనందరికీ తెలిసిందే. నాడు నేతన్నల ఆకలి చావులతో జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకెక్కిన సిరిసిల్ల నేడు సిరిశాలగా మారి కోటి బతుకమ్మ చీరెలతో తెలంగాణ ఆడబిడ్డల ముఖాలలో సంబురాన్ని చూసుకొని మురుస్తోంది, చేతినిండా ముద్దతో కడుపు నింపుకుంటోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అతి తక్కువ కాలంలోనే సిరిసిల్ల ప్రాంతంలో నేతన్నల ఆత్మహత్యలు ఆగిపోయినవి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పర్యటించి ‘జనంసాక్షి’ నేతన్నల అభిప్రాయం తెలుసుకొనే ప్రయత్నం చేసింది. సిరిసిల్ల నేతన్నల అభిప్రాయాలతో రూపొందించిన డాక్యుమెంటరీని ఈరోజు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, పరిశ్రమలు, సమాచార సాంకేతిక(ఐటీ) శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్‌ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ..ఆఫీసుల్లో కూర్చుండి కాకుండా కష్టపడి గ్రౌండ్ రిపోర్ట్ ఉన్నదున్నట్టుగా చూపడం ‘జనంసాక్షి’కే సాధ్యమని, వాస్తవ పరిస్థితులను ప్రజలకు, ప్రభుత్వానికి చేరవేయడం అభినందనీయమని అన్నారు. అంతే కాకుండా ‘జనంసాక్షి’ మరింత వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, జనంసాక్షి ఎడిటర్ రహమాన్ తో పాటు పలువురు జనంసాక్షి సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -