నగరం నలువైపులా అభివృద్ధి: కేటీఆర్

119
ktr
- Advertisement -

సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్నారు మంత్రి కేటీఆర్. సోమవారం శేర్లింగంపల్లి నియోజకవర్గంలో లింకు రోడ్లను ప్రారంభించారు కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…నగర అభివృద్ధికి రహాదారులు చాలా ముఖ్యమన్నారు. ఇప్పటికే 16 లింక్ రోడ్లు పూర్తి చేశామన్నారు. లింక్ రోడ్ల వల్ల ప్రధాన రహదారులపై భారం తగ్గుతుందన్నారు.

ఎస్ఆర్డీపీలో భాగంగా వంతెన‌లు, అండ‌ర్ పాస్‌లు నిర్మిస్తున్నాం అని మంత్రి తెలిపారు. రూ. 6 వేల కోట్ల‌తో ఎస్ఆర్డీపీ ప‌నులు కొన‌సాగుతున్నాయి. ఎస్ఆర్డీపీతో పాటు సీఆర్ఎంపీ కింద రూ. 1800 కోట్ల‌తో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని తెలిపారు.

ఇవాళ ప్రారంభించుకున్న‌ 5 లింక్ రోడ్ల నిర్మాణం రూ. 27.43 కోట్ల వ్య‌యంతో చేప‌ట్టామ‌ని పేర్కొన్నారు. రెండో ద‌శ‌లో రూ. 65 కోట్ల‌తో నాలుగు రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటికి అద‌నంగా రూ. 230 కోట్ల‌తో మ‌రో 13 రోడ్ల‌ను అభివృద్ధి చేస్తామ‌ని పేర్కొన్నారు. మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా రోడ్ల నిర్మాణం చేప‌డుతున్నామ‌ని పేర్కొన్నారు. ట్రాఫిక్, ప్ర‌యాణ దూరం త‌గ్గించేలా లింక్ రోడ్ల‌ను పూర్తి చేస్తున్నామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

- Advertisement -