గ్రేటర్ హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన..

152
ktr
- Advertisement -

ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్. ముఖ్యంగా గ్రేటర్‌లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన లింక్ రోడ్ల నిర్మాణాలను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉద‌యం 10.30 గంట‌ల‌కు నందిహిల్స్ లింక్‌రోడ్డును కేటీఆర్ ప్రారంభిస్తారు.

అనంతరం జూబ్లీహిల్స్ రోడ్ నం.45 నుంచి పాత ముంబై రోడ్డు లెద‌ర్ పార్క్ వ‌ర‌కు నిర్మించిన రోడ్డుతో పాటు లెదర్ పార్కును ప్రారంభించనున్నారు. అలాగే లెద‌ర్ పార్క్ వ‌ద్ద జీహెచ్ఎంసీ చేప‌ట్టిన వీయూసీ వంతెన ప‌నుల‌కు శంకుస్థాప‌న చేస్తారు.

పాత ముంబై హైవే నుంచి ఖాజాగూడ వ‌ర‌కు లింక్‌రోడ్డుతో పాటు మియాపూర్‌, నిజాంపేట మ‌ధ్య లింక్ రోడ్డ‌ను ప్రజ‌ల‌కు అందుబాటులోకి తీసుకురానున్నారు.

- Advertisement -