థ్యాంక్స్‌ అద్విత- మంత్రి కేటీఆర్‌

482
ktr
- Advertisement -

కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా పలువురు విరాళాలు అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతనిస్తూ ఎంతో మంది దాతలు సీఎం సహాయ నిధికి విరాళాలు అందించడానికి ముందుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ చిన్నారి తను పోదుపు చేసుకున్న మొత్తాన్ని విరాళంగా ఇచ్చి తన గొప్ప మనసును చాటుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను గాంధీ మిరియాల అనే వ్యక్తి సామాజిక మాధ్యమంలో తెలిపారు.

‘కేటీఆర్‌ అన్నయ్య.. టీవీ, సోషల్ మీడియాల్లో అందరూ విరాళాలు ఇస్తుండడం చూసి నా కూతురు అద్విత కూడా తన సేవింగ్ గళ్ల గురిగి పగలకొట్టి మరీ డొనేట్ చేసింది… మీరంటే ఒక అభిమానం’ అంటూ ఒకరు కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ఆ పాప తెలంగాణ ప్రభుత్వానికి రూ.440 విరాళం ఇచ్చిన విషయానికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్‌ థ్యాంక్స్‌ అద్విత అని ఆ ట్వీట్‌ను రీట్వీట్‌ చేసి ఆమె ఫొటోను పోస్ట్ చేశారు. ఆ పాపపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

- Advertisement -