కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్

61
ktr
- Advertisement -

కేంద్ర సర్కార్‌పై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్. సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని రసూల్‌పురాలో నాలా అభివృద్ధి పనులకు, పాటిగడ్డలో మోడ్రన్‌ మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌కు మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం మాట్లాడిన కేటీఆర్….. కేంద్రప్రభుత్వం పేదలకు పట్టాలు ఇవ్వడంలేదని చెప్పారు. రోడ్లు వేస్తామంటే స్థలం ఇవ్వడం లేదని విమర్శించారు. కంటోన్మెంట్‌లో రోడ్లను మూసేయడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కంటోన్మెంట్‌లోనూ ఉచిత మంచినీటి పథకం అమలు చేస్తున్నామని..రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంటును అభివృద్ధి చేస్తుండగా, కేంద్రం అడ్డుకుంటున్నది ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -