క‌రెన్సీ నోట్ల‌పై మోదీ…కేటీఆర్ సెటైర్

21
ktr
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై మరోసారి సెటైర్ వేశారు మంత్రి కేటీఆర్. మోదీ స‌ర్కార్ చేస్తున్న ఆగ‌డాల‌ను కేటీఆర్ తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ఒక‌వేళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు అవ‌కాశం ఇస్తే, త్వ‌ర‌లో ఆర్బీఐ ముద్రించే నోట్ల‌పై మోదీ బొమ్మ‌ను వేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు. క‌రెన్సీ నోట్ల‌పై మ‌హాత్మా గాంధీ బొమ్మ బ‌దులుగా మోదీ బొమ్మ‌ను ముద్రించినా ఆశ్చ‌ర్యం లేద‌ని సెటైర్ వేశారు.

గుజ‌రాత్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ఆందోళ‌న‌ వ్య‌క్తం చేశారు. ఆ రాష్ట్ర రాజ‌ధాని అహ్మ‌దాబాద్‌లో ఎల్‌జీ మెడిక‌ల్ కాలేజీ పేరును మార్చ‌డం ప‌ట్ల ఆయ‌న ప్ర‌భుత్వ తీరును త‌ప్పుప‌ట్టారు. ఎల్‌జీ మెడిక‌ల్ కాలేజీ పేరును న‌రేంద్ర మోదీ మెడిక‌ల్ కాలేజీగా మార్చిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. ఇప్ప‌టికే అక్క‌డ ఉన్న స‌ర్దార్ ప‌టేల్ స్టేడియంను న‌రేంద్ర మోదీ స్టేడియంగా మార్చిన‌ట్లు విమ‌ర్శించారు.

- Advertisement -