నడ్డా చెప్పులు మోసే గులామ్‌ ఎవరు?

29
ktr
- Advertisement -

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. వరంగల్‌లో జరిగే బీజేపీ బహిరంగసభకు హాజరుకానుండగా జేపీ నడ్డాను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.

జేపీ నడ్డా చెప్పులు మోసే గులామ్‌ ఎవరు అంటూ బీజేపీ నేతలను ప్రశ్నించారు. దీనికి తీవ్రమైన పోటీ ఉంటుందని కచ్చితంగా చెబుతున్నానని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటన సందర్భంగా షా కు.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పులు అందించిన విషయం తెలిసిందే. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -