ఆటోడ్రైవర్‌పై మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు..

74
- Advertisement -

ఆటోడ్రైవర్‌పై మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. తమిళనాడుకు చెందిన అన్నాదురై ఆటోడ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే అతను ప్రయాణికుల అవసరాలు తెలుసుకుని తన ఆటోను అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దిన తీరుకు మంత్రి కేటీఆర్‌ ఫిదా అయ్యారు. ఆటోను ప్రపంచ స్థాయి సదుపాయాలతో తీర్చిదిద్దాడని కితాబునిచ్చారు. ఫస్ట్ క్లాస్ క్యాబిన్ లా తన ఆటోను తయారు చేశాడని కొనియాడారు.

ఇదొక గొప్ప ఆలోచన అని మంత్రి కేటీఆర్ మెచ్చుకున్నారు. అన్నాదురై గత 10 ఏళ్లుగా చెన్నైలో ఆటో నడుపుతున్నాడు. తన ఆటోలో ఫ్రీ వైఫై, స్నాక్స్, కూల్ డ్రింక్స్ ఉన్న ఫ్రిడ్జ్, లాప్ టాప్, ఐపాడ్ వంటివి ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా అన్నాదురై మాట్లాడుతూ, కస్టమర్లే తనకు ప్రధానమని… డబ్బు కంటే తనకు కస్టమర్ల సంతోషమే ముఖ్యమని..అందుకని కస్టమర్ల కోసం పలు లగ్జరీ గాడ్జెట్స్‌ను అందుబాటులో ఉంచానని అన్నాదురై స్వయంగా వెల్లడించాడు.

- Advertisement -