చిరంజీవి కుటుంబసభ్యులను పరామర్శించిన మంత్రి కేటీఆర్..

148
minister
- Advertisement -

అనారోగ్యంతో మరణించిన తొలితరం తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ కొల్లూరి చిరంజీవి గారి పార్థివదేహానికి మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాక్టర్ గా ఉన్నత చదువులు చదివి సమాజం కోసం బతికిన చిరంజీవి జీవితం ఆదర్శనీయమన్నారు.

తెలంగాణ తొలి, మ‌లి ద‌శ ఉద్య‌మాల్లో కీల‌క పాత్ర పోషించిన డాక్ట‌ర్ చిరంజీవి కొల్లూరి(74) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గ‌చ్చిబౌలి ఏఐజీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ సోమ‌వారం తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచారు.

- Advertisement -