అంబేద్కర్‌కు ఘనంగా నివాళి…

51
ktr
- Advertisement -

రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ 131వ జయంతిని పురస్కరించుకుని అసెంబ్లీలో పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. అసెంబ్లీ ఆవరణలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్‌కు మంత్రి కేటీఆర్ ఘ‌న నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగ‌మం చేసిన ఆ మ‌హానీయుడికి నివాళుల‌ర్పిస్తున్నాన‌ని పేర్కొన్నారు. ఎంత కాలం జీవించామన్నది కాదు.. ఎంత గొప్పగా జీవించామన్నదే జీవితం అనే అంబేద్క‌ర్ సూక్తిని కేటీఆర్ ట్వీట్ చేశారు.

- Advertisement -