- Advertisement -
ఓటు అనే ఆయుధంతో నవ సమాజాన్ని నిర్మిద్దాం అని తెలిపారు మంత్రి కేటీఆర్. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ట్విట్టర్లో ట్వీట్ చేసిన కేటీఆర్.. భవిష్యత్ ఎలా ఉండాలో నిర్ణయించుకునే శక్తి ఓటు ద్వారా లభిస్తోంది. ఉదాసీనతను వదిలి ఓటనే ఆయుధాన్ని వినియోగించుకుందాం అని పేర్కొన్నారు. ఓటు వేయడం ద్వారా అసలైన ప్రజాస్వామ్య దేశాన్ని నిర్మిద్దాం. మనమంతా ఓటేసి నవ సమాజానికి పూలబాటలు పరుద్దాం అన్నారు.
- Advertisement -