ఒఆర్‌ఆర్‌పై ఎల్ఈడీ లైట్లను ప్రారంభించిన కేటీఆర్‌..

62
Minister KTR
- Advertisement -

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఔటర్ రింగ్ రోడ్డుపై ఏర్పాటుచేసిన ఎల్ఈడీ లైట్లను గురువారం రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఔటర్ రింగ్ రోడ్డులో హెచ్ఎండిఎ మరియు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ఎల్ఈడీ లైట్లను ఏర్పాటుచేశారు. నాలుగు ప్యాకేజీలలో 100 కోట్లతో 136 కిలోమీటర్ల మేర ఈ లైట్లను ఏర్పాటు చేశారు. వీటిని 136 కిలో మీటర్లలో రెండు వైపులా ఉన్న సర్వీస్ రోడ్లను ఒక కిలోమీటరు మేర ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు.

ఓఆర్ఆర్‌పై 158 కిలోమీటర్ల మేర ఎల్ఈడీ లైట్లు వెలగనున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి , మంత్రి మల్లారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, శాసన మండలి సభ్యులు శాంబిపూర్ రాజు, స్థానిక సర్పంచ్ ఉపేందర్ ,హెచ్ఎండీఏ అధికారులు.

- Advertisement -