ఇది ఇల్లు కాదు పేద వాడి ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక- మంత్రి కేటీఆర్‌

117
ktr
- Advertisement -

మ‌ల‌క్‌పేట నియోజ‌క‌వ‌ర్గంలోని సైదాబాద్, పిల్లిగుడిసెలు బ‌స్తీలో నూత‌నంగా నిర్మించిన 288 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ ప్ర‌సంగింస్తూ.. డ‌బుల్ బెడ్రూం ఇండ్ల ల‌బ్దిదారుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి జ‌ర‌గాల‌నే ఉద్దేశంతో ఆయా ప్ర‌తిపాద‌న‌ల‌తో స్థానిక ఎమ్మెల్యే బ‌లాల ఎన్నోసార్లు సీఎం కేసీఆర్‌ను క‌లిసి విన్న‌వించారు.

డ‌బుల్ బెడ్రూం ఇండ్లు, ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, డ్రైనేజీ, మంచినీటి సౌక‌ర్యం క‌ల్పించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. వీట‌న్నింటిని ప‌రిష్క‌రించుకుంటూ ముందుకు వెళ్తున్నామ‌ని తెలిపారు. జంగంమెట్‌, బండ్ల‌గూడ‌, ఫారూఖ్‌న‌గ‌ర్‌లో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం వేగ‌వంతం చేసి పేద ప్ర‌జ‌ల‌కు అంద‌జేస్తామ‌న్నారు. పిల్లిగుడిసెల బ‌స్తీలో ఒక‌ప్పుడు మంచినీళ్ల గోస ఉండేది. డ్రైనేజీ స‌రిగా లేక ఇబ్బందులు ప‌డేవారు. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవు అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

ఈ చౌర‌స్తాలో ఒక వేళ ప్ర‌యివేటు బిల్డ‌ర్ ఇల్లు క‌ట్టి ఉంటే.. ఒక్కో ఇల్లు రూ. 50 నుంచి రూ. 60 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌రీదు చేసి ఉండేవి. కానీ సీఎం కేసీఆర్ నిరుపేద ప్ర‌జ‌లు ఆత్మ‌గౌర‌వంతో బ‌త‌కాల‌నే ఉద్దేశంతో ఉచితంగా ఇండ్లు క‌ట్టించి ఇస్తున్నారు. నాణ్య‌త విష‌యంలో రాజీ ప‌డ‌కుండా.. ప‌నులు చేస్తున్నాం. ఇది ఇల్లు కాదు.. పేద వాడి ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక. స‌ర్వ‌హంగుల‌తో ఈ ఇండ్ల‌ను నిర్మించాం. 19 షాపుల‌ను ఏర్పాటు చేశాం అని కేటీఆర్ తెలిపారు.

చంచ‌ల్‌గూడ జైలు త‌ర‌లింపు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా..
చంచ‌ల్‌గూడ జైలును ఇక్క‌డి నుంచి త‌ర‌లించాల‌ని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఓవైసీ విజ్ఞ‌ప్తి చేశారు అని కేటీఆర్ తెలిపారు. 34 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న చంచ‌ల్‌గూడ జైలును త‌ర‌లించి.. ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే విధంగా ఇండ్లు కానీ, ఐటీ పార్కు కానీ, విద్యాసంస్థ‌లు కానీ ఏర్పాటు చేయాల‌ని కోరుతున్నారు. ఈ విష‌యాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామ‌ని చెప్పారు. అభివృద్ధి విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం వెన‌క్కిపోదు అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. న‌గ‌రంలో నాలుగు టిమ్స్ ను నిర్మించ‌బోతున్నారు. గ‌చ్చిబౌలిలో టిమ్స్‌ను ఏర్పాటు చేశారు. స‌న‌త్ న‌గ‌ర్‌, అల్వాల్, గ‌డ్డి అన్నారంలో మ‌రో మూడు టిమ్స్ ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఈ మూడింటికి త్వ‌ర‌లోనే శంకుస్థాప‌న చేసి.. రాబోయే రెండు, మూడేండ్ల‌లో అందుబాటులోకి తీసుకొస్తామ‌న్నారు.

- Advertisement -