షేక్‌పేట్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌..

76
- Advertisement -

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన ఫ్లైఓవర్ల నిర్మాణాలు పూర్తి అయ్యి అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా రూ.333 కోట్లతో రాయదుర్గం – టోలిచౌకి మధ్య 2.7 కిలోమీటర్ల పొడవున నిర్మించిన షేక్ పెట్ ఫ్లై ఓవర్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, అరికెపుడి గాంధీ, ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, సురభి వాణీదేవి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి మరియు జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -