రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ ధ్యేయం..

243
ktr minister
- Advertisement -

నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌ రెడ్డి పర్యటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం భవనాన్ని మంత్రులు ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా ముస్తాబాద్‌లో రైతు వేదిక నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. రాచర్ల గొల్లపల్లిలో వ్యవసాయ గోదాంకు శంకుస్థాపన చేశారు. రైతు భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ. రైతులు నిర్భయంగా సేద్యం చేసుకునేందుకు అన్ని రకాల వసతులు కల్పించామన్నారు. ఎరువులు, విత్తనాలు అందించేందుకు సీఎం ఆర్థిక చేయూత అందించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని తెలిపారు. వానాకాలం సాగు కోసం నిధులు అందజేశాం. ఎరువులు, విత్తనాలు ముందస్తుగా తీసుకొచ్చి రైతులు వరుసల్లో నిలబడకుండా చేశామన్నారు. గతంలో సమైక్య రాష్ట్ర పాలనలో తెలంగాణ రైతులు ఎన్నో కష్టాలు పడ్డారు.

ktr

తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయం ఎట్లా ఉందో రైతులందరికీ తెలుసు అని కేటీఆర్‌ అన్నారు. ఇవాళ రైతులకు పెట్టుబడికి, విత్తనాలకు, ఎరువులకు, నీళ్లకు కరెంట్‌కు కొదవ లేదు. సీఎం కేసీఆర్‌ కృషితో ఎండకాలంలోనూ చెరువులన్నీ నిండుకుండలా మారాయన్నారు. రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని కేటీఆర్‌ స్పష్టం చేశారు. నియంత్రిత పంటల సాగుతో దేశంలో వ్యవసాయానికి నవశకం రానుంది. మద్దతు ధరల లేని పంటలను వేయొద్దని సీఎం చెబతున్నారు. మద్దతు ధర వచ్చే సాగు చేస్తే రైతులు బాగుపడతారన్నదే సీఎం ఆకాంక్ష అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

- Advertisement -