ఆ ఐదుగురికి స‌వాల్ విసిరిన కేటీఆర్..

263
KTR
- Advertisement -

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన కార్య‌క్ర‌మం హ‌రితహారం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్య‌క్ర‌మం విజ‌యవంతం కావ‌డంతో ప‌లు ద‌శ‌లుగా హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. ఒక తాజాగా సెల‌బ్రెటీలు చేస్తున్న గ్రీన్ ఛాలెంజ్ ల‌తో ఒక్కరు మూడు మొక్క‌లు నాటుతున్నారు. ఇటివ‌లే ఎంపీ క‌విత ఈఛాలెంజ్ ను స్వీక‌రించి ప‌లువ‌రికి ఛాలెంజ్ విసిరిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా మంత్రి కేటీఆర్ మూడు మొక్క‌లు నాటుతూ మ‌రో ఐదుగురు సెల‌బ్రెటీల‌కు స‌వాల్ విసిరారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి మంత్రి కేటీఆర్ కు విసిరిన స‌వాల్ మంత్రి నేడు స్వీక‌రించారు.

ktr green challeange

టీ సాట్ ప్ర‌థ‌మ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా కేటీఆర్ నిన్న మొక్క‌లు నాటారు. ఈసంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ స‌వాల్ విసిరిన వాళ్ల‌లో ప్ర‌ముఖ హీరో మ‌హేశ్ బాబు, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్క‌ర్ , వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్, రాజ్ దీప్ స‌ర్దేశాయ్, అమెరికా కాన్సులే్ట జ‌న‌ర‌ల్ కేథ‌రిన్ హ‌డ్డాకు మంత్రి కేటీఆర్ హ‌రిత స‌వాల్ ను విసిరారు. తాను స‌వాల్ విసిరిన ఈఐదుగురు ఒక్క‌రు మూడు మొక్క‌లు నాటాల‌ని పిలుపునిచ్చారు. హ‌రిత హారం కార్య‌క్ర‌మంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది.

- Advertisement -