- Advertisement -
రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ ఇవాళ్టి నుండి విదేశాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం 10 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్తారు. అక్కడ మూడు రోజుల పాటు వివిధ సంస్థల అధిపతులు, సీఈవోలతో భేటీ కానున్నారు.
అక్కడినుండి స్విట్జర్లాండ్కు వెళ్లనున్నారు కేటీఆర్. దావోస్లో ఈనెల 22 నుంచి 26 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొననున్నారు కేటీఆర్. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా సామాన్యులకు మెరుగైన సేవలు అన్న అంశంపై ప్రసంగించనున్నారు.
కేటీఆర్ తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర అధికారుల బృందం వెళ్లనుంది.
- Advertisement -