హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దాలి- మంత్రి కేటీఆర్‌

138
- Advertisement -

విశ్వ‌న‌గ‌రంగా హైద‌రాబాద్ ఎద‌గాలంటే ఆధునిక వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసుకోవాలి. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు ఎలాంటి దుర్గంధం వెద‌జ‌ల్ల‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాలి అన్నారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ‘స్వచ్ఛ హైదరాబాద్’ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా నవీన పద్ధతులలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం 40 చెత్తను త‌ర‌లించే అత్యాధునిక వాహ‌నాల‌ను ఈరోజు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీతో కలిసి మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు.

అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఏ న‌గ‌రంలో అయినా రెండు ముఖ్య‌మైన వ్య‌ర్థాలు ఉత్ప‌త్తి అవుతాయని తెలిసిందే. సాలిడ్, లిక్విడ్ వేస్ట్ ఉంటాయి. స్వ‌చ్ఛ తెలంగాణ స్వ‌చ్ఛ హైద‌రాబాద్ కార్య‌క్ర‌మంలో భాగంగా వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు ప‌రిష్కారాలు వెతుకుతూ వ‌స్తున్నాం. 2014లో 2500 మెట్రిక్ ట‌న్నుల చెత్త సేక‌రిస్తే.. ప్ర‌స్తుతం 6 వేల మెట్రిక్ ట‌న్నుల చెత్త‌ను సేక‌రిస్తున్నాం. 4500 స్వ‌చ్ఛ ఆటో టిప్ప‌ర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆటోల‌ను చెత్త సేక‌ర‌ణ‌కు ఉప‌యోగిస్తున్నాం. త్వ‌ర‌లోనే మ‌రో 400 ఆటోలు నెల రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. 150 డివిజ‌న్ల‌లో డోర్ టు డోర్ క‌లెక్ష‌న్‌కు వినియోగిస్తామ‌న్నారు.

హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దాల‌న్న కేసీఆర్ ఆశ‌యానికి అనుగుణంగా ప‌ని చేయాలి అని కేటీఆర్ అధికారుల‌ను ఆదేశించారు. విశ్వ‌న‌గ‌రంగా హైద‌రాబాద్ ఎద‌గాలంటే ఆధునిక వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసుకోవాలి. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు ఎలాంటి దుర్గంధం వెద‌జ‌ల్ల‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాలి. 95 సెకండ‌రీ క‌లెక్ష‌న్ ట్రాన్స్‌ఫ‌ర్ పాయింట్లు ఏర్పాటు చేసుకున్నాం. మొబైల్ క‌లెక్ష‌న్ ట్రాన్స్‌ఫ‌ర్ పాయింట్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం. హైద‌రాబాద్‌ను ప‌రిశుభ్రంగా ఉంచేందుకు అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. అత్యాధునిక‌మైన సాలిడ్ వేస్ట్ ట్రీట్‌మెంట్ ఉండాల‌న్న ఉద్దేశంతో అత్యాధునిక ప‌ద్ధ‌తుల‌ను అవ‌లంభిస్తున్నాం. లిక్విడ్ వేస్ట్ ట్రీట్‌మెంట్ కోసం సీవ‌రేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తున్నాం. చెరువుల్లో చెత్త‌, గుర్ర‌పు డెక్క‌ను త‌ర‌లించేందుకు వాహ‌నాల‌ను వినియోగిస్తున్నామ‌ని తెలిపారు.

- Advertisement -