ప్రజల ప్రాణాలే ముఖ్యం..కరోనా కట్టడికి మరిన్ని చర్యలు

217
ktr
- Advertisement -

కొవిడ్ కట్టడి కోసం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ తొలి మీటింగ్  ఈ రోజు సచివాలయంలో జరిగిందన్నారు మంత్రి కేటీఆర్. టాస్క్‌ ఫోర్స్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ …. ఇప్పటికే ప్రభుత్వం ఇస్తున్న హోం ఇసోలేషన్ మందుల నిల్వలో ఎలాంటి కొరత లేదు న్నారు. ఇప్పటిదాకా పెద్ద ఎత్తున ఇంటి ఇంటికి సర్వే చేస్తూ… అవసరం అయిన వారికి మెడికల్ కిట్స్ ఇస్తున్నాం అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 60 లక్షల ఇళ్లలో సర్వే పూర్తి అయింది…ఇప్పటి దాకా 2.1 లక్షల కిట్స్ ఇచ్చాము. ఇది ఇన్ పేషంట్ విజిట్స్ అదనమన్నారు.

ప్రభుత్వము చేస్తున్న ప్రయత్నం వలన వేలాది మందిని కాపడగలము… ఈ మందులను కోవిడ్ లక్షణాలు రాగానే ఈ మందులు వాడడం వలన సీరియస్ కండిషన్ లో హాస్పిటల్ అవ్వాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుందన్నారు. ఈ ప్రయత్నం పలితాలు ఒకటి రెండు రోజుల్లో కనిపిస్తుంది అన్న ఆశాభావం ఉందన్నారు. రాష్ట్రంలో బెడ్స్ భారీగా పెంచాము…. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేటు లో ఆసుపత్రులు సైతం భారీగా పెరిగాయి…రెమిడిసివర్ లాంటి మందుల నిల్వలు ఉన్నాయన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1.5 Lacs ఇంజెక్షన్లు ఉన్నాయి…. రాష్ట్రంలో ఇంజెక్షన్లు తయారుచేస్తున్న కంపెనీల నుంచి అదనపు సరఫరాకు సమన్వయము చేస్తామన్నారు. దీంతో పాటు ఆసుపత్రుల్లో ఈ ఇంజెక్షన్ వినియోగం పైన వివరాలు తీసుకుంటున్నాము. వీటి వినియోగం పైన ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తాం అన్నారు. వీటితో పాటు రోగులు సీరియస్ గా అరుదుగా, అత్యవసరంగా వాడుతున్న టోలిసిజుమాబ్ వంటి మరిన్ని మందుల సరఫరా కూడా సరిపడేలా చూసుకోవాలని సూచించారు.

బ్లాక్ ఫంగస్ అంశంలో కూడా ప్రభుత్వం అలెర్ట్ గా  ఉంది… దీనికి అవసరం అయిన మందులను ప్రభుత్వం సరఫరా చేస్తుందన్నారు. ఆక్సిజన్ సప్లై గురించి కూడా చర్చించాము, ప్రస్తుతానికి అవసరము అయిన డిమాండ్- సప్లై పైన వివరాలు తిస్కున్నామని చెప్పారు. అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల తో ఆక్సిజన్ వినియోగానికి అవసరమైన మేరకే వాడేలా చర్యలు చేపట్టాలన్నారు.

కోవిడ్ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నంబర్ ఉండేలా చర్యలు తిస్కోవాలని సూచించారు. జిల్లాలో కోవిడ్ నియంత్రణ చర్యల పర్యవేక్షణ కోసం మంత్రులు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు… మంత్రులు చేస్తున్న పర్యవేక్షణ చర్యలతో సమన్వయం అధికారులకు సూచించామన్నారు.. 

రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడి జనాభా 92 లక్షలు గా ఉంది…. ఇందులో ఇప్పటికే 38 లక్షల మంది ఫస్ట్ డోస్ తీసుకున్నారు…. వీరిలో 7.15 లక్షల మందితో పాటు  3 లక్షల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ ఇప్పటికే రెండు డోసులు తీసుకున్నారని చెప్పారు కేటీఆర్. మొత్తంగా 10 లక్షలకు పైగా జనాభా పూర్తి వాక్సిన్ తీసుకున్నారు….. వాక్సిన్ ప్రజలకు అందించెందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలను ప్రారంభించిందన్నారు. రానున్న రోజుల్లో కరోనాకి చికిత్సకు అవసరమైన మందుల తయారీ దారులతో పాటు… వ్యాక్సిన్ తయారీదారులతో సమావేశం అవుతామన్నారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకునేందుకు కైనా సిద్ధంగా ఉన్నాం….తెలంగాణ ప్రభుత్వం కరోనా కోసం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు.

ఇతర రాష్ట్రాల పరిస్థితులతో పోలిస్తే తెలంగాణలో మంచి పరిస్థితి ఉంది…తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యల సత్ఫలితాలను ఇస్తున్నాయి… ప్రభుత్వ చర్యలను కేంద్రం కూడా గుర్తించిందన్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి ఈ మేరకు అభినందించారు…. ఎప్పటికప్పుడు కరోనా కట్టడికి చర్యలను ముమ్మరం చేస్తున్నాము…. మరింత సమగ్రంగా కార్యాచరణ తీసుకుని ముందుకు పోతాం అన్నారు.

- Advertisement -