ఫార్మాసిటీని అడ్డుకునేందుకు కుట్రలు: మంత్రి కేటీఆర్

251
ktr
- Advertisement -

హైదరాబాద్ ఫార్మాసిటీని అడ్డుకునేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్.అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేటీఆర్…అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ ఫార్మాసిటీ ఏర్పాటు కాబోతుందన్నారు.

ఫార్మాసిటీ కోసం ఇప్పటివరకు 8 వేల ఎకరాల భూసేకరణ చేశామని…మరికొంతభూమి సేకరించాల్సి ఉందన్నారు. డీపీఆర్‌ను అధ్య‌య‌నం చేసిన త‌ర్వాత‌నే ప‌రిశ్ర‌మ‌ల‌కు భూములు కేటాయిస్తున్నామ‌ని, ఆ భూముల‌ను ప‌రిశ్ర‌మ‌లు వినియోగించ‌క‌పోతే వెనక్కితీసుకుంటున్నామ‌ని వెల్ల‌డించారు.

భూసేక‌ర‌ణ‌కు స్థానిక నేతలు, యువ‌త స‌హక‌‌రించార‌ని తెలిపారు. భూ నిర్వాసితుల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. న‌ష్ట‌పోయిన భూమికి ప‌రిహారంగా తిరిగి భూమి చెల్లించే యోచ‌న‌లేద‌ని చెప్పారు.

- Advertisement -