డబుల్ డెక్కర్ బస్సులపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఓ నెటిజన్ తనకు ట్యాగ్ చేసిన వీడియోపై స్పందించిన కేటీఆర్… అబిడ్స్లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో తాను చదువుకున్నప్పుడు.. దారిగుండా వెళ్తున్నప్పుడు డబుల్ డెక్కర్ బస్సులు కనిపించేవి. డబుల్ డెక్కర్ బస్సుల గురించి చాలా జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.
ఆ బస్సులను ఎందుకు ఆపేశారో తనకు కచ్చితంగా తెలియదన్నారు. డబుల్ డెక్కర్ బస్సులను మళ్లీ రోడ్లపైకి తీసుకువచ్చేందుకు ఏమైనా అవకాశం ఉందా? అంటూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ను కేటీఆర్ అడిగారు.
ఒకప్పుడు డబుల్ డెక్కర్ బస్సు సికింద్రాబాద్ నుంచి జూపార్క్ మార్గంలో 7 నంబర్తో నడిచేవి. జూపార్క్ నుంచి హైకోర్టు, అఫ్జల్గంజ్, అబిడ్స్, హుస్సేన్ సాగర్, రాణిగంజ్ మీదుగా సికింద్రాబాద్కు చేరుకునేవి డబుల్ డెక్కర్ బస్సులు. హైదరాబాద్లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులను ప్రయాణికులు లేదా టూరిస్టుల కోసం తీసుకురావాలని షాకీర్ హుస్సేన్ కేటీఆర్ను కోరారు. ఈ నేపధ్యంలోనే మంత్రి కేటీఆర్ స్పందించారు.