పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కొప్పుల..

259
Minister Koppula
- Advertisement -

గత సంవత్సరంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా మంచి వర్షాలు కురవడంతో వరి,పత్తి పంటల దిగుబడి బాగా పెరిగిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా కొత్తపేటలో సోమవారం ఆయన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,నీటి వనరులు పుష్కలంగా పెరగడంతో వరి,పత్తి పంటలు సమృద్ధిగా పండాయని తెలిపారు.

జగిత్యాల జిల్లాలో సుమారు 17వేల మంది రైతులు పత్తి సాగు చేయగా,20వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చినట్లు ఒక అంచనా ఉందన్నారు. చుట్టుపక్కల ఉన్న అన్ని మండలాల రైతులకు అందుబాటులో ఉండేవిధంగా ఈ కొనుగోలు కేంద్రాన్ని కొత్తపేటలో ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. పత్తి రంగు మారకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ,ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా మంత్రి రైతులను కోరారు.

- Advertisement -