టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై దాడి అమానుషం…

141
koppula eshwar
- Advertisement -

సిద్దిపేటలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై జరిగిన దాడిని ఖండించారు మంత్రి కొప్పుల ఈశ్వర్. దళిత సామాజిక వర్గానికి చెందిన క్రాంతి కిరణ్‌, వేముల వీరేశంలపై బీజేపీ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు.

బడుగు, బలహీన వర్గాలకు చెందిన నాయకులు, ప్రజల పట్ల బీజేపీ పార్టీ వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాల్సిందిగా డీజీపీ మహేందర్ రెడ్డిని మంత్రి కోరారు. ఇది బీజేపీ పార్టీకి దళిత వర్గాలపై ఉన్న వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు.

- Advertisement -