టీఆర్ఎస్ కంచుకోటగా నల్లగొండః మంత్రి జగదీశ్వర్ రెడ్డి

617
Jagadishwar Reddy
- Advertisement -

కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నల్లగొండ జిల్లాను టీఆర్ఎస్ కంచుకోటగా మార్చామన్నారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి. సూర్యపేట జిల్లా మిర్యాలగూడలో టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే భాస్కర్ రావు పలువురు ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గోన్నారు.

ఈసందర్భంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ పార్టీదే విజయం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సీఎం కేసీఆర్ వైపే ఉన్నారన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తామే గెలుస్తామని కాంగ్రెస్, బీజేపీ నాయకులు పగటికలలుకన్నారు. బీజేపీ కి డిపాజిట్ కూడా రాలేదు.. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతయ్యింది. గతంలో ఈజిల్లాలో ఎంతో మంది మంత్రులు గా చేసి జిల్లాను అభివృద్ధి చేసిందేమీ లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కేవలం టీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ది జరిగింది.

ప్రజల కోసం అనునిత్యం తపనపడే వ్యక్తి గా ఎమ్మెల్యే భాస్కర్ రావు ముందుంటారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డులలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మిర్యాలగూడ రూపు రేకలు మారుస్తామని హామి ఇచ్చారు. వార్డులలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్దుల మధ్యనే పోటీ ఉంది…మిగతా పార్టీలకు పోటీ చేసేందుకు అభ్యర్దులు కరువయ్యారన్నారు. సోనియాగాంధీ, మోదీ సొంత రాష్టాల్లో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

- Advertisement -