సంతోష్ బాబు…చిర‌స్మ‌ర‌ణీయుడు

35
jagadheeshreddy
- Advertisement -

భార‌త్ – చైనా స‌రిహ‌ద్దుల్లో జ‌రిగిన యుద్దంలో వీర‌మ‌ర‌ణం పొందిన క‌ల్న‌ల్ సంతోష్ బాబు వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఘ‌నంగా నివాళి అర్పించారు మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి. ఈ సంద‌ర్భంగా కాస‌ర‌బాద్ రోడ్డులో ఏర్పాటు చేసిన సంతోష్ బాబు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఆయ‌న‌.. దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబు చరిత్రలోనే చిరస్మరణీయుడిగా నిలిచి పోతారని కొనియాడారు. సంతోష్ బాబు మరణానంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సహాయ సందేశం ఇతర రాష్ట్రాల తో పాటు యావత్ భారతదేశానికి స్ఫూర్తివంతమైన సందేశాన్ని చేరవేసిందన్నారు.

ఆర్మీలో పనిచేసే ప్రతి ఒక్కరికి రేపటి రోజున వారి కుటుంబాలకు భారత ప్రజలు అండగా ఉంటారు అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సహాయానికి సందేశం అని జ‌గ‌దీష్ రెడ్డి చెప్పారు.

- Advertisement -