సభ జరగకుండా కాంగ్రెస్ కుట్రలు: జగదీష్ రెడ్డి

183
minister jagadish reddy
- Advertisement -

హాలియాలో సీఎం కేసీఆర్ సభ జరగకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నో కుట్రలు చేసిందని మండిపడ్డారు మంత్రి జగదీష్ రెడ్డి. సీఎం కేసీఆర్ అంటేనే వెన్నులో వణుకు పుడుతుంది కాంగ్రెస్ నాయకులకు …..వారి బండారం బయటపడుతుంది అని కాంగ్రెస్ వాళ్లు బెంబేలెత్తిపోతున్నారని మండిపడ్డారు.

ప్రాణాలను పణంగా పెట్టి, తెలంగాణ ను సాధించిన గొప్ప మహనాయకుడు సీఎం కేసీఆర్….ఆకలిని పారద్రోలిన ఘనత సీఎం కేసీఆర్…..దేశానికే అభివృద్ధి నమూనాను చూపించారు సీఎం కేసీఆర్ అన్నారు.ఫ్లోరైడ్ ను పారద్రోలిన ఘనత సీఎం కేసీఆర్ ది…….రాష్ట్రంలో అత్యధికంగా పంటలు పండించిన ఘనత ఉమ్మడి నల్గొండ జిల్లకు దక్కింది… రికార్డ్ స్థాయిలో దిగుబడులు వచ్చాయి……ఇవి అన్ని సాధించింది సీఎం కేసీఆర్ అన్నారు.

సీఎం కేసీఆర్ ఆశీర్వదించి నాకు అవకాశం ఇచ్చారని నోముల భగత్ అన్నారు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా…….మా నాన్న ను ఆదరించిన విధంగానే నన్ను మీ బిడ్డలగా ఆదరించండన్నారు.మా నాన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని చెప్పారు.

- Advertisement -