ఉద్యమ స్ఫూర్తితో హరితహారంలో పాల్గోనాలి

198
Minister Jagadish
- Advertisement -

తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో హరితహారం కార్యక్రమంలో పాల్గోనాలని పిలుపునిచ్చారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి. నల్గొండ జిల్లా నకిరేకల్ లో హరితహారం కార్యక్రమంలో పాల్గోన మొక్కలు నాటారు మంత్రి జగదీశ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, ఎంపీ లింగయ్య యాదవ్ , ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు.

ఈసందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పిలపుమేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో మొక్కలు నాటే కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు, చూపు దర్శనికథతో అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయన్నారు. వర్షాభావ పరిస్ధితులను కూడా అధిగమించాలంటే మొక్కలు నాటడం ఒక్కటే పరిష్కారం అన్నారు.

- Advertisement -