మీడియాపై మండిపడ్డ రకుల్

311
rakul
- Advertisement -

అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ మీడియాపై అసహనం వ్యక్తం చేసింది. తనపై తప్పుడు వార్తలు ఎందుకు రాస్తున్నారని మండిపడింది. ఇక అసలు విషయానికి వస్తే తమిళ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా రకుల్ ప్రింగ్ కథానాయికగా ఓ సినిమా తెరకెక్కుతుంది. కొంత వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇటివలే లాక్ డౌన్ లో సండలింపులు ఇవ్వడంతో తిరిగి షూటింగ్ లు ప్రారంభించారు. అందులో భాగంగానే ఈమూవీ షూటింగ్ కూడా ప్రారంభమైంది. దీంతో రకుల్ ఒక రెండు నెలలు షూటింగ్ కి రానని చిత్రయూనిట్ కు చెప్పిందని..దీంతో రకుల్ ను ఈమూవీని తీసేశారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

తాజాగా ఈవార్త రకుల్ చూసి స్పందించింది. బాధ్యతాయుతమైన జర్నలిజం మనకు ఎప్పుడు వస్తుంది? వాస్తవాలను చెక్ చేసుకుని రాయాలి అని చెప్పింది. నాకూ షూటింగ్ లో పాల్గోనాలనే ఉంది…అసలు షూటింగ్ లు ఎక్కడ జరుగుతున్నాయో చెప్పండి అసలు మీడియాను ప్రశ్నించింది. సెలబ్రెటీల మీద ఇలా ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయడం ఎంత వరకు కరెక్ట్ అని మండిపడింది. మరోవైపు ఇదే అంశంపై స్పందించారు ఈ మూవీ దర్శకుడు ఆర్. రవికూమార్. ఈమూవీలో నుంచి రకుల్ ను తీసేశారు అని వస్తున్న వార్తల్లో నిజం లేదని..రకుల్ తో పనిచేయాడానికి తాము ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -