ముందస్తు ఎన్నికలపై ఉత్తమ్ పగటి కలలు- మంత్రి

132
- Advertisement -

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలపై మంత్రి జగదీష్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆయన ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలొస్తాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి పగటి కలలు కంటున్నాడు. సమయం ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీఆర్‌ఎస్ పూర్తి మెజారిటీ సాధిస్తుందన్నారు. ప్రజలు ఊహించని సంక్షేమం అందిస్తున్న కేసీఆర్ పాలన ఇంకా పది కాలాల పాటు రాష్ట్రంలో కొనసాగుతుంది. ప్రజాబలం కోల్పోతున్నామనే బాధతో టీఆర్‌ఎస్‌పై ప్రతిపక్షాలు అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నాయి. తెలంగాణాలో ఉన్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవు.. ప్రతిపక్షాలు విమర్శించే అవకాశం లేకుండా రాష్ట్రంలో సంక్షేమం కొనసాగుతుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

- Advertisement -